రాజ్యసభ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు వర్ల రామయ్య. అసెంబ్లీ కార్యదర్శికి తన నామినేషన్ పత్రాలను సమర్పిచారు. వర్ల రామయ్య వెంట మాజీ మంత్రులు దేవినేని ఉమా, నక్కా ఆనంద్బాబు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. దళిత బిడ్డల వాణిని రాజ్యసభలో వినిపిస్తానన్నారు టీడీపీ నేత వర్ల రామయ్య.