మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, DCM ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు. మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్సు.. డీసీఎంను ఢీకొంది. డీసీఎంలోని వారంతా ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ ఘటనలో మొత్తం ఏడుగురు మృతి చెందారు.మరో 20మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.