విశాఖపట్నం వైసీపీలోను అసంతృప్తి భగ్గుమంది. GVMC ఎన్నికల్లో 37వ వార్డులో సీటు కేటాయింపులో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ కేడర్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించింది. ఆఫీసులో ఆందోళన నిర్వహించారు. ఆ సమయంలో అక్కడున్న వైసీపీ ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావును మహిళలు నిలదీశారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని.. కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారికి గంపగుత్తగా ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. 37వ వార్డులో ఎన్నో ఏళ్లుగా తాను కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని.. కొత్తగా వచ్చిన డమ్మీ క్యాండేట్ వడ్డాది రాజుకు అవకాశం ఇచ్చారని జానకిరామ్ ఆరోపించారు.