ఏపీలో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నెల్లూరులో.. ప్రభుత్వ యంత్రాంగం యుద్ధం ప్రకటించింది. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్, అధికారులతో మంత్రులు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ తెలిపారు.