ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలందరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు. రోజు రోజుకూ తీవ్రతరమవుతున్న కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. స్వల్పకాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా 10వేల మందికి పైగా మృతి చెందారని పేర్కొన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కోవడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు.