దేశవ్యాప్తంగా ప్రస్తుతం జనతా కర్ఫ్యూ కోనసాగుతోంది. ఉదయం 7 గంటలనుంచి ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో తాజాగా మరో రెండు కరోనా మరణాలను నివేదించింది ప్రభుత్వం.. అలాగే కేసుల సంఖ్య 370 కి చేరుకుంది. ఇందులో తెలంగాణాలో కరోనావైరస్ బాధితుల సంఖ్య 22కు చేరింది. తాజాగా గుంటూరుకు చెందిన 24 ఏళ్ల యువకుడికి కరోనావైరస్ పాజిటివ్గా నిర్థారించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడు లండన్ నుంచి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు చేరుకున్నట్లు గుర్తించారు.