కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావం లోక్ సభ ను తాకడంతో ఆర్ధిక బిల్లుకు ఎటువంటి చర్చ లేకుండా వాయిస్ ఓటు ద్వారా ఫైనాన్స్ బిల్లు 2020 ను ఆమోదించింది. అనంతరం లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. మరోవైపు కరోనావైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని పేదలకు, అసంఘటిత కార్మికులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.