ప్రభుత్వ భవనాలకు రంగులపై సుప్రీంలోనూ ఏపీ సర్కార్కు షాక్ తగిలింది. పార్టీ రంగులు తొలగించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం.. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.