ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని గురుద్వారాలో ఇస్లామిక్ స్టేట్ ముష్కరులు రెచ్చిపోయారు. ప్రార్ధనలు చేసుకుంటున్న వారిపై ఆత్మాహుతి దాడి జరపడంతో 11 మంది మృతి చెందారు.. ఈ మేరకు స్థానిక మీడియా కథనం ప్రసారం చేసింది. ఇది తమ పనే అని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ కూడా ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు వార్తా సంస్థ AFP నివేదించింది. ఆలయం లోపల సుమారు 150 మంది కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయి.. వారు సాధారణంగా ఉదయం ప్రార్థనలు చేసుకుంటున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. సిక్కులపై దాడిని భారత మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా ఖండించారు.