కలకలం.. గాంధీ హాస్పిటల్ నుంచి పరారైన కరోనా బాధితుడు

Update: 2020-04-06 13:47 GMT

తెలంగాణలో కరోనా వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో ఓ బాధితుడు గాంధీ హాస్పటల్ నుంచి పరారవడం ఒక్కసారిగా కలకలం రేపింది. గద్వాలకు చెందిన కరోనా బాధితుడిని వారం రోజుల క్రితం గాంధీ హాస్పటల్‌లోని ఐసోలేషన్ వార్డులో జాయిన్ చేశారు. అయితే సదరు బాధితుడు ఆదివారం రాత్రి పరారైనట్లు డాక్టర్లు గుర్తించారు. గాంధీ హాస్పటల్ వైద్యుల సమాచారం మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Similar News