ముంబై సెంట్రల్లోని వాక్హాడ్ హాస్పిటల్కి చెందిన ముగ్గురు వైద్యులు, 26 మంది నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రిలో వైద్యసేవలను నిలిపివేశారు. అంతేకాకుండా ఆ ఆసుపత్రిని కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఒక్కసారిగా ఆ హాస్పిటల్లో పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో సర్కార్ దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు పేర్కొన్నారు. ముంబైలో ఇప్పటి వరకు 500 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా 34 మంది మృతి చెందారు.