జమ్మూ కశ్మీర్లోని కీరన్ సెక్టార్ పరిధిలో ఉన్న నియంత్రణ రేఖ (ఎల్ఓసి)కు ఎదురుగా ఉన్న దూద్నైల్లో ఇండియన్ ఆర్మీ ఉగ్రవాదులను హతమార్చింది. అంతేకాదు భారత సైన్యం జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులు, 15 మంది పాకిస్తాన్ ఆర్మీ సైనికులు మరణించారని ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. మరణించిన ఐదుగురు ఉగ్రవాదులలో, ముగ్గురు జమ్మూ కాశ్మీర్కు చెందినవారు కాగా, మిగతా ఇద్దరు జైష్-ఇ-మొహమ్మద్ కు చెందిన వారు ఉన్నారు. అయితే పాకిస్థాన్ మాత్రం దీనిని బుకాయిస్తోంది. 15 ఏళ్ల బాలికతో సహా నలుగురు పౌరులకు మాత్రమే గాయాలు అయ్యాయని చెబుతోంది.