లాక్డౌన్ నిబంధనలుఉల్లంగిస్తూ.. బర్త్డే పార్టీ జరుపుకున్న ఓ బీజేపీ నేతను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నవీ ముంబైలోని అజయ్ బహిరా అనే బీజేపీ నేత తన ఇంట్లో బర్త్డే పార్టీ ఏర్పాటు చేరినట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడకు చేరుకోవటంతో దాదాపు 10 మందితో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. వారిని అరెస్ట్ చేసిన పన్వేల్ ఎస్ఐ అజయ్ కుమార్ లండ్గే మాట్లాడుతూ.. పార్టీ జరుపుకుంటున్నట్టు తమకు ముందస్తు సమాచారం అందిందని.. దీంతో అక్కడికి చేసారుకోని చుస్తే.. కనీసం సోషల్ డిస్టెన్సింగ్ పాటించకుండా పార్టీ చేసుకుంటున్నారని తెలిపారు. దాంతో వారందరినీ అరెస్టు చేశామని తెలిపారు.
కాగా దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా మహారాష్ట్రలో ముంబైలోని ఉంది.