ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. కరోనా బాధితుల సంఖ్య 20 లక్షల చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 20 లక్షలకు తాకనున్నది. ప్రస్తుతం జాన్స్ హాప్కిన్స్ వర్సిటీ లెక్కల ప్రకారం.. 19 లక్షల 29 వేల మందికి వైరస్ సోకింది. ప్రపంచవ్యాప్తంగా లక్షా 20 వేల మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు.