విజయసాయి రెడ్డి దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారు: విష్ణువర్దన్‌రెడ్డి

Update: 2020-04-20 17:53 GMT

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిపై ప్రశ్నించినందుకే కన్నా లక్ష్మీనారాయణపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సమస్యలను పక్కదోవ పట్టించేందుకే విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పెద్దలే లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారని.. వారి వలనే కరోనా వ్యాప్తి చెందుతుందని ఆరోపించారు. హెల్త్‌ బులెటిన్ల విడుదల చేయటంలో కూడా నిర్లక్ష్యం వహిస్తోన్నారని ఆక్షేపించారు.

Similar News