కరోనా: శ్రీలంకలో ఎన్నికలు వాయిదా

Update: 2020-04-21 13:45 GMT

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. అనేక దేశాలు పలు అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసుకుంటూన్నాయి. తాజాగా శ్రీ లంక పార్లమెంటు ఎన్నికలను 2 నెలలు వాయిదా వేసుకుంది. ఈ మేరకు ఆ దేశ ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకు 295 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏడుగురిని కరోనా పొట్టన పెట్టుకుంది. దీంతో ఈ నెల 25న జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.

కాగా.. టోక్యో లో జరగాల్సిన ఒలింపిక్స్ కూడా వాయిదా పడ్డాయి. అటు భారత్ లో పలు రాష్ట్రాల్లో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాయిదా పదిన సంగతి తెలిసిందే.

Similar News