మహారాష్ట్రలో మూడు మెట్రో నగరాలైన ముంబై, నాసిక్ , పూణేలలో కరోనా అంటువ్యాధి క్రమంగా పెరుగుతోంది. ముంబైలో కరోనా రోగుల సంఖ్య 3032 కు చేరుకుంది. ఇక పూణే ప్రాంతంలో 663 మందికి వ్యాధి సోకింది. నాసిక్లోని మాలెగావ్లో ఈ ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంది. జిల్లాలో ఇప్పటివరకు 95 పాజిటివ్ కేసులు కనుగొనబడ్డాయి,
అందులో 85 మాలేగావ్కు చెందినవి. మంగళవారం, రాష్ట్రంలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి, దీంతో మొత్తం సోకిన వారి సంఖ్య 4676 కు చేరుకుంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా సంక్రమణ కారణంగా తొమ్మిది మంది మరణించడంతో మొత్తంగా 232 మంది మరణించారు. ఇందులో ఒక్క ముంబైలోనే 139 మంది మరణించారు.