ముస్లింలకు ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా కీలక సూచనలు

Update: 2020-04-22 18:29 GMT

ఇస్లామిక్ సెంటర్ ఆఫ్ ఇండియా ముస్లింలకు కీలక సూచనలు చేసింది. కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో ముస్లింలు రంజాన్ ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని కోరింది. ఈ మహమ్మారితో యుద్ధం త్వరగా ముగిసిపోవాలని.. యుద్ధంలో మనిషి విజయం సాధించాలని ప్రార్థన చేయాలని తెలిపింది.

ప్రార్థనలు చేసేటపుడు అష్ట దిగ్బంధనం నిబంధనలను పాటించాలని, ఒకరికొకరు దూరంగా ఉంటూ ప్రార్థనలు చేయాలని కోరింది.

కాగా ఈ నెల 25 నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది.

Similar News