ఇవాళ ఉత్తరప్రదేశ్ లో మరో 17 పాజిటివ్ కేసులు

Update: 2020-04-25 10:50 GMT

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లో ఏప్రిల్ 25 ఉదయం 8:00 గంటల వరకు 17 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో యూపీలో మొత్తం 1,621 కేసులకు చేరుకుంది. నిన్నటివరకూ వ్యాధి సోకిన వారిలో 247 మంది కోలుకున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25 మంది మరణించారు.

రాష్ట్రంలో నమోదైన మొత్తం 1621 కేసుల్లో ఆగ్రాలో అత్యధికంగా 241 కేసులు ధృవీకరించబడ్డాయి. కాగా ఉత్తర ప్రదేశ్‌ 1,621 కేసులతో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్యను బట్టి 7వ స్థానంలో ఉన్నాయి.

Similar News