ఏపీలో నాలుగు రోజుల పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విశాఖపట్నం, విజయనగరంలో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇక కోస్తాకు తుపాను గండం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఉత్తర అండమాన్ నికోబార్ దీవుల్లో మరో తుఫాన్ చెలరేగనున్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. కోస్తా తీరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించారు.