అందరు అనుకున్నట్టు కరోనా సాధారణ జ్వరం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా మామూలు జ్వరం అనుకున్న వారు ఈ వ్యాధికి సంబంధించి ఒకసారి సైన్స్ న్యూస్ను చూడాలని.. ఆ లింక్ను(www.sciencenews.org) కూడా ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఆ సంస్థ ఇచ్చిన కేస్ స్టడీని పరిశీలించాలన్నారు. చైనాలో కేస్ స్టడీస్ చూడండి. కరోనా సాధారణ జ్వరం కాదని.. కరోనా రోగుల్లో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వెల్లడైందని పవన్ పేర్కొన్నారు. కరోనా సాధారణ జ్వరం లాంటిదే అని.. దానికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం జగన్ చెప్పిన విషయం తెలిసిందే.