24 గంటల్లో చైనాలో నాలుగు కొత్త కేసులు నమోదు

Update: 2020-04-30 15:43 GMT

24 గంటల్లో దేశంలో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం తెలిపింది. అయితే మరణాలు ఎక్కడా సంభవించలేదని తెలిపింది. ఈ నాలుగు కేసులు షాంఘై నగరంలో నమోదయ్యాయి. దేశంలోని 31 ప్రావిన్సులలో ఇప్పటివరకు 82 వేల 862 సంక్రమణ కేసులు ఉన్నాయి. అలాగే మహమ్మారి భారిన పడి 4633 మంది మరణించారు. 77 వేల 610 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

Similar News