24 గంటల్లో దేశంలో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ గురువారం తెలిపింది. అయితే మరణాలు ఎక్కడా సంభవించలేదని తెలిపింది. ఈ నాలుగు కేసులు షాంఘై నగరంలో నమోదయ్యాయి. దేశంలోని 31 ప్రావిన్సులలో ఇప్పటివరకు 82 వేల 862 సంక్రమణ కేసులు ఉన్నాయి. అలాగే మహమ్మారి భారిన పడి 4633 మంది మరణించారు. 77 వేల 610 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.