తెలంగాణలో కరనా పాజిటివ్ కేసులు రోజు రోజుకీ నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ప్రకటించారు . దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,044కు చేరింది. ప్రాణాంతకర వైరస్ నుంచి కోలుకుని శుక్రవారం 24 మంది కరోనా బాధితులు డిశ్చార్జి అయ్యారు.