బిగ్ బ్రేకింగ్.. లాక్ డౌన్ పొడిగిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం

Update: 2020-05-01 20:25 GMT

లాక్ డౌన్ మరో రెండు వారాల పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో లాక్ డౌన్ మే 3వ తేదితో ముగియనుండగా.. తాజాగా లాక్ డౌన్ ను మే 17 వరకు కేంద్రం పొడిగించింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరుగుతుండటంతో కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ప్రధాని మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. శనివారం ఉదయం 10గంటలకు ఆయన మీడియా ముందుకు రానున్నారు. కరోనా కట్టడి చర్యల కొనసాగింపుపై కీలక ప్రకటన చేయనున్నారు.

Similar News