తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

Update: 2020-05-03 21:23 GMT

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి సర్కార్ లాక్ డౌన్ విధించి అమలు చేస్తోంది. ఈనేపథ్యంలో కరోనా వైరస్‌ నివారణ, లాక్‌డౌన్‌ సడలింపులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్‌, నిరంజన్‌ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం జోన్లవారీగా లాక్‌డౌన్‌ ఆంక్షల సడలింపులపై విడుదల చేసిన మార్గదర్శకాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఈనెల 5న కేబినెట్‌ భేటీలో చర్చించాల్సిన అంశాలపై కసరత్తు చేస్తున్నారు.

Similar News