కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కంట్రోల్ రూం మొదటి గది మూతపడింది. ఈ గదిలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు కరోనా సోకడంతో రూం నెంబర్ వన్ను మూసేశారు. అయితే, ఈ రూంలో పనిచేసే సిబ్బంది మొత్తం సెల్ఫ్ క్వారంటైన్కు వెళ్లారు. శానిటైజింగ్ ప్రక్రియ తర్వాత గదిని తిరిగి తెరుస్తారు. అయితే, రూమ్ నెంబర్ ఒకటి మాత్రమే మూతపడింది. మిగతా అన్ని గదుల్లో విధులు యథాతథంగా కొనసాగుతున్నాయి.