తెలంగాణలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. ఆదివారం కొత్తగామరో 33 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 1,196కు చేరింది. ఇప్పటి వరకు 751 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. ఇంకా 415మంది చికిత్స పొందుతున్నారు. ఆదివారం నమోదైన కేసుల్లో 26 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో కాగా.. మరో ఏడుగురు వలస కూలీలుగా గుర్తించారు.