ఏపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచి ప్రజల నడ్డి విరిచిందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రజలకు సీఎం జగన్.. జగనన్న కరెంట్ షాక్ కానుక ఇచ్చారని ఎద్దేవా చేశాయి. లాక్డౌన్ నేపథ్యంలో కరెంట్ బిల్లులను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రతిపక్ష నేతలు. మరోవైపు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం కోతలు పెడుతోందని ఆరోపించారు.