తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం కొత్తగా 41 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు సంఖ్య1367కు చేరుకుందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే, కరోనా నుంచి కోలుకొని 117 మంది బుధవారం డిశ్చార్జి అవ్వడం.. కాస్తా ఉరట కలిగించే విషయం. ఇప్పటి వరకూ 939 మంది డిశ్చార్జి అవ్వగా.. ఇంకా 394 చికిత్స పొందుతున్నారు.