మెయిన్‌రోడ్‌పై చిరుత.. పట్టుకునేందుకు సమాయత్తమైన అధికారులు

Update: 2020-05-14 12:53 GMT

రాజేంద్రనగర్ లోని మైలార్ దేవులపల్లి ప్రాంతంలో చిరుత సంచారం తీవ్రకలకలం రేపింది. కాటేదాన్ అండర్ బ్రిడ్జ్ రోడ్డుపై చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. NH 7 మెయిన్ రోడ్ పై గాయంతో ఎటు వెళ్లలేని స్థితిలో ఉంది. దీంతో సమాచారం అందుకున్న అధికారులు దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మైలార్ దేవులపల్లి పోలీసులు, జూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. అయితే చిరుత ఎక్కడినుంచి వచ్చింది, దానికి గాయం ఎలా అయింది అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

 

Similar News