భక్తులు లేకుండా బద్రీనాథ్ దేవాలయంలో పూజలు

Update: 2020-05-15 09:11 GMT

ప్రముఖ పుణ్యక్షేత్రం.. బద్రీనాథ్ దేవాలయం తలుపులు శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర గంటల సమయంలో ఆలయ అధికారులు తెరిచారు. లాక్ డౌన్ కారణముగా భక్తులు ఎవరూ రాలేదు. దీంతో బద్రీనాథ్ ఆలయ చరిత్రలో.. భక్తులు లేకుండా తెరవడం ఇదే మొట్టమొదటిసారి. ఆలయ ప్రధాన పూజారితోపాటు కేవలం 27 మందిని మాత్రమే బద్రీనాథ్ దేవాలయంలోకి అనుమతించి.. పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం తెరిచినా కరోనా నేపథ్యంలో భక్తులెవరినీ ఆలయంలోకి అనుమతించేది లేదని అధికారులు చెప్పారు.

Similar News