విశాఖ గ్యాస్ లీక్ ఘటన.. తక్షణ పరిహారం కింద 50 కోట్ల రూపాయలు డిపాజిట్
విశాఖలో నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ బృందం పర్యటన కొనసాగుతోంది.. గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలతో విశాఖ కలెక్టర్ వినయ్ చంద్కు 50 కోట్ల రూపాయల చెక్ను ఎల్జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులు అందజేశారు.. గ్యాస్ లీక్ ఘటనపై తక్షణ పరిహారం కింద 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది.. ఎన్జీటీ ఆదేశాలతో విశాఖ కలెక్టర్కు సంస్థ ప్రతినిధులు చెక్ అందజేశారు.