కేంద్రం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ బోగస్ అంటూ తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శించడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. కేంద్రం ప్యాకేజీతో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదా అని ప్రశ్నించారు. FRBM పరిమితిని 3 నుంచి 5 శాతం పెంచామని.. ఈ సంస్కరణలో లోపాలేంటో కేసీఆర్ చెప్పాలన్నారు.
తెలంగాణలో పంటలు వేసే విధానాన్ని కేంద్రం వ్యతిరేకించడం లేదని.. అలాంటప్పుడు ప్రధాని ఓ నియమం పెడితే దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాత్కాలిక ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం సరికాదన్నారాయన.