2020లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ పోటీలు 2022కు వాయిదా పడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఐసీసీ వర్గాలు మాత్రం ఇది నిజమే అంటున్నాయి. 2021 అక్టోబర్లో టీ 20 ప్రపంచ కప్ పోటీలు భారత్లో నిర్వహించాల్సి ఉంది. 2022లో ఆస్ట్రేలియా టీ 20 ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తుంది. 2023లో భారత్ 50 ఓవర్ల ప్రపంచకప్ పోటీలు నిర్వహిస్తుంది. ఈనెల 28న జరిగే ఐసీసీ కీలక సమావేశంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల అయ్యే అవకాశం ఉంది.