పది, ఇంటర్ పరీక్షలకు సిద్ధమవుతున్న సీబీఎస్సీ విద్యార్థులకు కేంద్రం ఓ గుడ్ న్యూస్ తెలిపింది. విద్యార్థులకు పరీక్షా కేంద్రాలను విద్యాశాఖ చాలా రోజుల క్రితం ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా లాక్ డౌన్ అమలు చేయడంతో చాలా మంది విద్యార్థులు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. దీంతో పరీక్షా కేంద్రాలు దూరం అవుతున్నాయని విద్యార్థులు బయపడుతున్నారు. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పరీక్షా కేంద్రాలకు దూరంగా ఉన్న విద్యార్థులు ఎవరూ.. వారు ఉన్న జిల్లాలను దాటి వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. దీనికి సంబందించి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుందని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ప్రకటించారు.