ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం

Update: 2020-06-06 22:42 GMT

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కలకలం రేపింది. సీఎం వైఎస్ జగన్ పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌ కరోనా బారిన పడ్డారు. మరో ఐదుగురు ఉద్యోగులు కూడా వైరస్ సొకింది. దీంతో ఇప్పటి వరకు ఏపీ సచివాలయంలో కొవిడ్ సోకిన వారి సంఖ్య 10కి పెరిగింది. పొరుగుసేవల ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఓ ఉద్యోగి, ప్రణాళిక విభాగంలో డ్రైవర్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి, పరిశ్రమల శాఖలో పనిచేసే ఓ ఎంప్లాయికి వైరస్‌ సోకింది... అలాగే సీఎం బ్లాక్‌లోని RTGSలో పనిచేసే సర్వీస్‌ ప్రొవైడర్, విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్ధారణ అయింది.

Similar News