కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. పలు ప్రభుత్వ కార్యాలయాలలోని సిబ్బందికి కరోనా పాజిటివ్ రావటంతో మిగిలిన వారు ఆఫీసులు రావడానికి భయడుతున్నారు.
కొత్త మార్గదర్శకాలు
* దీంతో కేంద్రం కొత్త మార్గ దర్శకాలు జారీ చేసింది.
* దగ్గు, జలుబు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు ఉన్నవారు ఆఫీలులకు రాకూడదు.
* సెక్రటరీ స్థాయి అధికారులు రోజు విడిచి రోజు ఆఫీసులు రావాలి
* కట్టడి ప్రాంతాల ఉద్యోగులు ఇంటి నుంచే విధులు నిర్వహించాలి
* ఇంటర్కామ్ ఫోన్లలోనే ఉద్యోగులు మాట్లాడుకోవాలి
* ఆఫీసులో ఎవరి కంప్యూటర్ కీబోర్డులును వారే శానిటైజేషన్ చేసుకోవాలి
* వీడియో కాన్ఫరెన్స్ లోనే సమావేశాలు నిర్వహించుకోవాలి
* ఉద్యోగులు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవద్దు అని కొత్త మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది.