గోకుల్ చాట్ యజమానికి కరోనా.. ఆందోళన చెందుతున్న కస్టమర్లు..

Update: 2020-06-16 17:55 GMT

లాక్డౌన్ ముగిసింది. అన్నీ ఓపెన్ అయ్యాయి. దాంతో కరోనా కేసులు మరిన్ని వెలుగు చూస్తున్నాయి. తాజాగా గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అధికారులు చాట్ భండార్ ని మూసివేశారు. అందులో పని చేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు. కాగా, హైదరాబాద్ లో గోకుల్ చాట్ అంటే తెలియని వారుండరు. అక్కడికి రోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. చాట్ చాలా ఫేమస్. మరి యజమానికి కరోనా రావడంతో అక్కడ

చాట్ తిన్న ఎంత మందికి వచ్చిందో అని ఆందోళనకు గురవుతున్నారు అధికారులు, వినియోగదారులు. టెస్టులు చేయించుకుంటే కానీ బయటపడదు.

Similar News