తెలంగాణలో కొత్తగా 500 కరోనా కేసులు

Update: 2020-06-19 23:42 GMT

తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఒక్కరోజే సుమారు 500 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం 499 కేసులు నమోదుకావడంతో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తాజాగా నమోదైన కేసులతో కరోనా రోగుల సంఖ్య 6,526కి చేరింది. ఇప్పటి వరకు 3,352మంది డిశ్చార్జ్ అవ్వగా.. 2,976 మంది చికిత్స పొందుతున్నారు. అటు, గడిచిన 24 గంటల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 198కి చేరిందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

Similar News