సూర్యాపేట జిల్లాలో భూప్రకంపనలు

Update: 2020-06-23 19:03 GMT

సూర్యాపేట జిల్లా పరిధిలోని.. చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో... మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో పలు మార్లు భూప్రకంపనలు వచ్చాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో.. జనం బెంబేలెత్తారు. ఐదు నుంచి పది సెకెన్ల పాటు భూమి మూడుసార్లు కంపించింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలోనూ భూ ప్రపంకపనలు వచ్చాయి. దీంతో అప్పట్లో భూ భౌతిక శాస్త్రవేత్తల బృందం బాధిత ప్రాంతాల్లో పర్యటించింది. నమూనాలు సేకరించి టెస్టింగ్‌ సైతం చేసింది. అయితే భూమిలోపల సర్దుబాట్లు వల్లే ఈ ప్రకంపనలు వస్తున్నాయని, భయపడాల్సిన అవసరం లేదంటూ అప్పట్లో తేల్చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు మళ్లీ ప్రకంపనలు రావడంతో... పులిచింతల ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌ ప్రాంతాలైనా మళ్ల చెరువు, చింతలపాలెం, నెమలపురి ప్రాంతాల ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Similar News