పల్నాడులో మళ్లీ దాడులు మొదలయ్యాయి. టీడీపీ కార్యకర్తలే టార్గెట్ గా దాడులకు తెగబడుతున్నారు వైసీపీ నాయకులు. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్త చింతపల్లి గౌసుపై అటాక్ జరిగింది. తీవ్ర గాయాలు కావడంతో గౌసును పిడుగురాళ్లలోని ప్ర్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.