సోషల్ మీడియాలో అకౌంట్ ఉంది కదా.. మనకు ఏది నచ్చితే అది పోస్టు చేస్తానని అనుకుంటే మాత్రం ఇలాగే జరుగుతుంది. ఇలా సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులు చేసిందనే కారణంతో ఈజిప్టుకు చెందిన బెల్లీ డాన్స్ర్ సామా ఎల్-మస్రీకు న్యాయస్థానం జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష విధించింది. టిక్ టాక్, యూట్యూబ్ లో తను పోస్టు చేసిన వీడియోలు అనుచితంగా ఉన్నాయని.. ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించారు. దీనిపై స్పందించిన ఆమె ఈ వీడయోలకు తనకు ఎలాంటి సంబందం లేదని.. నాకు తెలియకుండా నా మొబైల్ నుంచి ఎవరో ఈ వీడయోలు పోస్టు చేశారని తెలిపింది. దీనిపై న్యాయపోరాటం చేస్తానని.. పైకోర్టుకు వెళ్తానని ఆమె తెలిపింది.