ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు కరోనా రోగులు మృతి

Update: 2020-06-30 09:27 GMT

ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆసుపత్రిలో ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరగటంతో.. ఏడుగురు కరోనా రోగులు మృతి చెందారు. ఈ ఘటన ఈజిప్ట్ దేశంలోని అలెగ్జాండ్రియా నగరంలో చోటు చేసుకుంది.

ఆసుపత్రిలో మంటలతో పాటు పొగవల్ల ఊపిరాడక కరోనా రోగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఆసుపత్రిలోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఈజిప్ట్ సివిల్ ప్రొటెక్షన్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు.

భద్రతా నిబంధనలు పాటించకపోవడం వల్లనే అగ్నిప్రమాదం సంభవించిందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

Similar News