తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. బుధవారం ఒక్కరోజే 1018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య ఇప్పటి వరకు 17,357 కు చేరింది.
ఇక కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 267 మంది మృతి చెందారు.
తెలంగాణలో ప్రస్తుతం 9008 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. బుధవారం 788 మంది డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం ఇప్పటివరకు 8082 మంది కరోనా బారి నుండి కోలుకున్నారు.