విజయవాడలో శుక్రవారం నుంచి మూడురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగనున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు మూ డురోజులపాటు శాకంబరి ఉత్సవాలు జరుగుతాయని ఆలయ కార్యనిర్వాహణాధికారి తెలిపారు. వివిధ రకాలైన కూరగాయలతో అమ్మవారి అలంకారం జరుగుతుందని పేర్కొన్నారు. మూడు రోజుల పాటు అమ్మవారు శాకంబరి దేవిగా దర్శనమిస్తారని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.