దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ముంద్కా ప్రాంతంలో ఉన్న ఓ గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రానిక్ వస్తువులు, వైద్య పరికరాలు నిల్వ చేసే గోదాముల్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటాన స్థలానికి చేరుకున్నారు. భారీగా ఎగసి పడుతున్న మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది 35 అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని డివిజినల్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేస్తామన్నారు.