దేశంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఇక రాజస్థాన్లో కరోనా స్వైర విహారం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 153 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి ఒక్కరోజే నలుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం బులెటిన్ విడుదల చేసింది. కరోనా బారినుండి ఒక్కరోజే 74 మంది కొలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 23,901కు చేరింది. ఇందులో 5,492 మంది కరోనాతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారిన పడి రాష్ర్టవ్యాప్తంగా 507 మంది మృతి చెందారు.