సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) 12వ తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. తన అధికారిక వెబ్సైట్లో ఫలితాల పూర్తి వివరాలను సీబీఎస్ఈ పొందుపరిచింది. cbseresults.nic.in పోర్టల్ నుంచి విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది 88.78 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 83.40 శాతం మంది ఉత్తీర్ణులు కాగా ఈ సారి కొంత ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఈ సందర్భంగా పరీక్షలు పాసై వారికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ కంగ్రాట్స్ చెప్పారు.
ఫిబ్రవరి 15 నుంచి మార్చి 30, 2020 వరకు జరిగిన ఈ పరీక్షల ఫలితాలు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పేపర్లు వాల్యువేషన్లో జాప్యం జరిగింది. ఇక అన్లాక్ అమల్లోకి రావడంతో పేపర్ వాల్యుయేషన్ పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షా ఫలితాలను ప్రకటించింది.