ఏపీలో రాగల 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. సముద్రం నుంచి తేమగాలులు కోస్తాపైకి వీచాయి. ఈ ప్రభావంతో రుతుపవనాలు బలంగా మారాయి. వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో ఆదివారం ఉదయం నుంచి అనేకచోట్ల ఉరుములు, పిడుగులతో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి.