ఎడతెరపులేని వర్షాలతో ఇండోనేషియా అంతా నీటిమయం అయింది. సులువేసి దీవిలో వరదల్లో మొత్తం 16 మంది మరణించారు. భారీ వర్షాలలో పలు గ్రామాలు నదులను తలిపిస్తున్నాయి. అటు, ఉత్తర లూవూ జిల్లాలో మరో 23 మంది వరదల్లో కొట్టకుపోయారని.. వారి కోసం తాము గాలిస్తున్నామని అధికారులు చెప్పారు. విమానాశ్రయాలు, రైల్వే ట్రాక్ లు బురద, వరద నీరు ముంచెత్తాయి. వరద పీడిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.